బ్రేకింగ్: ఏపీ హైకోర్ట్ కి జనసేన

-

ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతినే రాజధానిగా ఉంచాలని ఆ ప్రాంత నేతలు కూడా రైతులకు మద్దతుగా ఇప్పుడు డిమాండ్ లు చేస్తున్నారు. దీనికి రాజకీయ నాయకుల అండ కూడా ఉండటంతో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చింది.

హైకోర్ట్ లో కేసులు కూడా నడుస్తున్నాయి. ఈ క్రమంలో ట్విటర్ లో పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేసారు. అమరావతి రైతుల పక్షాన ఏపీ హైకోర్టు లో అఫిడవేట్ దాఖలు చేయనున్నామని ఆయన ప్రకటన చేసారు. ఈ బాధ్యతలను జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ తమ్మి రెడ్డి శివశంకర్ కు అప్పగిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు పిటీషన్ల పై విచారణలు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news