అర్నాబ్ గోస్వామి ఒక సైకో.. రేవంత్ విమర్శలు…!

-

రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి పై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి పై అర్నాబ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా పీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి అర్నాబ్ పై హైదరాబాద్ లోని నల్లకుంట లో పోలీసులకు ఫిర్యాదు చేసారు. సోనియా పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసారని మండిపడ్డారు.

పాల్ఘర్ లో హిందూ స్వామీజీపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ… హిందూ మతానికి  బదులుగా ముస్లిం బోధకులు లేదా క్రైస్తవ సాధువులు చంపబడి ఉంటే సోనియా గాంధీ నిశ్శబ్దంగా ఉండేవారని అర్నాబ్ ఆరోపించారు. ఆమె ఈ రోజు నిశ్శబ్దంగా  ఉన్నారు. కాని ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్న రాష్ట్రంలో హిందూ స్వామీజీ చంపబడినందుకు ఆమె సంతోషంగా ఉందని నేను భావిస్తున్నాను. మహారాష్ట్రలో హిందూ స్వామీజీలు చంపబడుతున్నారని ఆమె ఇటలీకి ఒక నివేదిక పంపిస్తున్నారని అర్నాబ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

టీవీ చర్చలో భాగంగా అర్నాబ్ సోనియా గాంధి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. తాజాగా రేవంత్ రెడ్డి కూడా అర్నాబ్ పై మండిపడ్డారు. అర్నాబ్ గోస్వామి చేసిన వ్యాఖ్యలను మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఖండించారు. ట్విట్టర్ వేదికగా రేవంత్ అర్నాబ్ పై మండిపడ్డారు. అర్నాబ్ సైకో అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. ఆయన్ను సామాజిక బహిష్కారణ చెయ్యాలి అంటూ రేవంత్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం

Read more RELATED
Recommended to you

Latest news