కొడాలి నానీ మనిషి కాదు, కొత్త పేరు పెట్టిన స్వామీజీ

-

ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీ మంత్రి కొడాలి నానీపై తీవ్ర ఆరోపణలు చేసారు. హిందువులకు పంగానామాల ప్ల కార్డ్స్ ప్రదర్శించారు. డిక్లరేషన్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి దర్శనం చేయడం ..హిందూవుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు పై.. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు,మంత్రులు స్పందించాలని డిమాండ్ చేసారు.

kodali nani
kodali nani

గంగ లో స్వామి చేతుల మీదిగా హిందువుగా మారాన్ని జగన్ చెబితే మేము అడిగే వాళ్ళం కాదని అన్నారు. జగన్ ను హిందూగా మార్చానని కనీసం శారద పీఠం స్వామి అయినా చెప్పాల్సి ఉందని అన్నారు. డిక్లరేషన్ ఇవ్వక పోయినా..పట్టు వస్త్రాలు సమర్పించారు..హిందువులకు జగన్ క్షమాపణ లు చెప్పాలని డిమాండ్ చేసారు. జేరుసేలంకి ముఖ్యమంత్రి వెళ్ళితే, ఆయన భార్య ను, కుటుంబ సభ్యులను తీసుకు వెళతారు..

తిరుపతికి తీసుకురావడంలో మీకు అభ్యంతరం ఏమిటి? అని ప్రశ్నించారు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు డిక్లరేషన్ గౌరవించారు.. మీరెందుకు గౌరవించరు? అని ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని ఏమి చదువుకున్నారు? ఏమి మాట్లాడుతున్నారు అని ప్రశ్నించారు. కొడాలి నాని మంత్రా? రౌడీ యా? అని నిలదీశారు. మంత్రి కొడాలి నాని రాజీనామా చేయాలి అని డిమాండ్ చేసారు. కొడాలి నాని..అచ్చోసిన ఆంబోతని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news