లక్ష ఇళ్ళు ఒక్కచోటే కడతారా ఏంటి…?

-

కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత భట్టి విక్రమార్క పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాట్ కామెంట్స్ చేసారు. బట్టికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. లక్ష ఇండ్లను ఒకే చోట కడతారా? అని ప్రశ్నించారు. మేము పారిపోలేదని అన్నారు. పనికి రాని వ్యక్తుల గురించి మాట్లడను అని స్పష్టం చేసారు. ప్రతిపక్ష నేత ఇంటికి వెళ్లి తీసుకెళ్లిన చరిత్ర గతంలో లేదని అన్నారు.

ఎక్కడెక్కడ ఎన్ని కడుతున్నామో లెక్కలు ఇస్తా అని అన్నారు. వాస్తవాలను భట్టి చూసి జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. బట్టి విక్రమార్క రాజకీయాలు చేస్తున్నారని తలసాని విమర్శలు చేసారు. ఐదారు ప్రాంతాల్లోనే లక్ష ఇళ్లు చూపిస్తారా? అని నిలదీశారు. నేను ముందు నడుస్తుంటే.. ఏవేవో తిడుతున్నారని ఆయన ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news