మ‌రో సారి స్పీక‌ర్ వ‌ర్సెస్ చంద్ర‌బాబు.. స‌భ నుంచి బాబును తొలిగించాలంటూ..

-

మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఉదయం ఇంగ్లీష్ మీడియం విషయమై చర్చ జరుగుతున్న సందర్భంగా, ఈ అంశంపై గురువారం నాడు సుదీర్ఘంగా చర్చించుకుందామని ముఖ్యమంత్రి జగన్, ఆర్థికమంత్రి బుగ్గన సూచించారు. ఈ చర్చ వ్యక్తిగత విమర్శల వైపు వెళ్లడంతో, చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారి తీశాయి. తనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరగా, ఆంగ్ల మాధ్యమంపై రేపు చర్చిద్దామని, నేడు ప్రవేశపెట్టాల్సిన బిల్లులు చాలా ఉన్నాయని స్పీకర్  తమ్మినేని సీతారాం అన్నారు.

ఆ సమయంలో చంద్రబాబు స్పీకర్ కు సభ్యత, సంస్కారం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు తక్షణం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేకుంటే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామని తమ్మినేని హెచ్చరించారు. స్పీకర్ స్థానానికి మర్యాద ఇవ్వకుంటే ఎలాగని ప్రశ్నించారు. మీకున్న 40 ఏళ్ల అనుభవం ఎందుకు ఉపయోగపడిందని మండిపడ్డారు. మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలపై అధికార పక్షం భగ్గుమంది. స్పీకర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను సభ్యులు తప్పుపట్టారు. చంద్రబాబును సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news