ఏపీకి షాక్ .. జలవివాదంపై సుప్రీం కోర్టుకు కేసీఆర్‌ సర్కార్

-

కృష్ణా నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతున్న విషయం తెల్సిందే. తెలంగాణ మంత్రులు ఉమ్మడి పాలకులతో పాటు ఏపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు. అటు ఏపీ నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే రెండు రాష్ట్రాల నేతల మధ్య పరస్పర ఆరోపణల నేపథ్యంలో…. జగన్‌ సర్కార్‌ కు తెలంగాణ ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్‌ ఇవ్వనుంది.

రాయలసీమ ఎత్తిపోతల పై సుప్రీం కోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం చేపడుతోన్న అక్రమ ప్రాజెక్టులపై సుప్రీం కోర్టు లో సవాలు చేయాలని నిర్ణయం తీసుకుంది కేసీఆర్‌ సర్కార్‌.

ఇందులో భాగంగానే.. ఒకటి, రెండు రోజుల్లో సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటీషన్ వేయనుంది. కాగా.. నిన్ననే జలవివాదంపై ఏపీ సీఎం జగన్‌… ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణా అక్రమంగా వాడేస్తోందని దీన్ని తక్షణం ఆపేలా చర్యలు చేపట్టాలని లేఖలో కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news