బ్రేకింగ్‌: టీఆర్‌ఎస్‌ ఖాతాలో రెండు మున్సిపాలిటీలు

-

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు విడివిడిగా కౌంటింగ్ చేపట్టారు. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ పలు మున్సిపాలిటీల్లో ముందంజలో నిలిచింది. ఇప్పటికే 9 నగరపాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 9 కార్పోరేషన్లలలో 325 వార్డులు ఉండగా, ఒకటి ఏకగ్రీవం అయ్యింది. ఇక ఫలితాల వెల్లడిలో 5 రౌండ్ల నుంచి 24 రౌండ్లు వరకు ఉంటాయి.

పరకాలలోని గణపతి కళాశాలలో పరకాల మున్సిపల్ ఎన్నికల ఓట్లు లెక్కిస్తున్నారు. అయితే పరకాల, చెన్నూర్‌ మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి. పరకాలలో 22 వార్డులకు 11 చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక చెన్నూర్‌లో 18 వార్డులకు 7 చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news