బ్రేకింగ్: టీఆర్ఎస్ సీనియర్ నేత మృతి…!

-

టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు ,2009 లో కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం సుదర్శన్ రావు కన్ను మూశారు. ఈ రోజు ఉదయం గచ్చిబౌలిలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో గుండె పోటు తో మరణించారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన అదే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం విషమించడంతో నేడు ఉదయం కన్ను మూశారు అని అధికారులు పేర్కొన్నారు.

కాగా ఆయన సిఎం కేసీఆర్ కి అత్యంత సన్నిహిత వ్యక్తిగా చెప్తారు. తెరాస పార్టీ బలోపేతానికి క్షేత్ర స్థాయిలో ఆయన కృషి చేసారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీకి ఆయన యెనలేని సేవలు అందించారు. రాజకీయంగా తెరాస పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో సిఎం కేసీఆర్ తో కలిసి ఆయన ప్రయాణం కొనసాగించారు.

Read more RELATED
Recommended to you

Latest news