తెలంగాణా కష్టం మొత్తం ఆ రెండు రాష్ట్రాలే తింటున్నాయా…?

-

తెలంగాణ నుంచి కేంద్రానికి ఆరేళ్లలో 2 లక్షల 75 వేల కోట్లు వెళ్లాయని, మా కష్టాన్ని తీసుకువెళ్లి, బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారు అంటూ తెరాస పార్లమెంటరీ పక్ష నేత, నామా నాగేశ్వర్ రావు ఆరోపించారు. పార్టీలు మాట్లాడే మాటల్లో వాస్తవాలు ఉండాలి అని ఆయన అన్నారు. బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఒక్క సారైనా రాష్ట్ర అభివృద్ధి గురించి పార్లమెంట్ లో మాట్లాడారా? అని నిలదీశారు.

గ్రేటర్ లో జిమ్మిక్కులు చేస్తున్నారు అని మండిపడ్డారు. హైద్రాబాద్ చుట్టూ 22టోల్ గేట్లు పెట్టి వసూలు చేస్తున్నారు అని విమర్శలు చేసారు. మాకు కేంద్రం కేవలం 30 శాతం మాత్రమే ఇచ్చారు అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు జిహెచ్ఎంసి ఎన్నికల కోసం రావాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు. ఈ మంత్రులంతా తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలి అని డిమాండ్ చేసారు. అన్న దమ్ముల్లా కలిసున్న హైద్రాబాద్ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. ఆర్ ఆర్ ఆర్ కోసం విజ్ఞప్తి చేసిన కేంద్రం అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news