‘దిశ’ బిల్లును వెనక్కి పంపిన కేంద్ర ప్రభుత్వం.. ఏం జ‌రిగిందంటే..?

-

ఏపీ ప్రభుత్వం ‘దిశ’ బిల్లును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అయితే, బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని సూచిస్తూ బిల్లును కేంద్రం వెనక్కి పంపింది. బిల్లులోని 7వ షెడ్యూల్ లో ఎంట్రీలు సరిగా లేవని, వాటిని సరిచేసి మళ్లీ పంపాలని కేంద్రం సూచించింది. దీంతో, సాంకేతిక అంశాలను సరిచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

కాగా, సోమవారం సచివాలయంలో సంబంధిత శాఖాధికారులతో దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సమీక్షించారు. రాజమండ్రిలో 7న దిశ పోలీ్‌సస్టేషన్‌, వన్‌స్టా్‌ప సెంటర్‌ను సీఎం జగన్‌ ప్రారంభిస్తారని చెప్పారు. పోలీ్‌సస్టేషన్‌ ప్రారంభోత్సవం తర్వాత సీఎం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. అక్కడ ‘దిశ’ ప్రత్యేక యాప్‌ను, స్టాండర్డ్‌ ఆపరేటివ్‌ ప్రొసీజర్‌నూ(ఎస్‌ఓపీ) ప్రారంభిస్తారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news