బ్రేకింగ్ : ఒక్క చెప్పు దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది

-

ఒక్క చెప్పు దెబ్బ ఆయన్ను రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. విషయం ఏంటంటే అఖిల భారత హిందూ మహా సభ ఏపీ అధ్యక్షులుగా వెలగపూడి గోపాలకృష్ణ నియమితులు అయ్యారు. అయితే ఆయన ఈ రోజు వరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండేవారు. అయితే ఆయన నిన్న అమరావతి రైతులకు మద్దతుగా దీక్షా శిబిరాలను సందర్శించారు. అంతేకాక ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ రైతులకు అండగా ఉంటుందని, ఈ పరిస్థితులకు తన పార్టీ కూడా కొంత మేర కారణం అని చెబుతూ మందడం శిబిరంలో తన చెప్పుతో తానే కొట్టుకున్నారు ఆయన.

ఈ సంఘటన మీడియాలో హైలైట్ కావడంతో గోపాల కృష్ణను పార్టీ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సస్పెండ్ చేశారు. అయితే పార్టీ నుండి సప్సెన్షన్ రావడంతో రాష్ట్ర అధికార ప్రతినిథి హోదా కూడా పోయింది. ఎలా తెలిసిందో కానీ ఈ విషయం అఖిల భారత హిందూ మహాసభ వారికి తెలిసింది. వెంటనే గోపాలకృష్ణకు ఫోన్ చేసిన అఖిల భారత హిందూ మహా సభ జాతీయ అధ్యక్షులు, గోపాల కృష్ణను రాష్ట్ర అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతే కాక ఈ మేరకు లేఖ పంపుతామని గోపాలకృష్ణకు హిందూ మహాసభ అధ్యక్షులు చెప్పినట్లు తెలుస్తోంది. నిజానికి హిందూ మహా సభ కూడా బీజేపీ కి మద్దతు తెలిపే సంస్థే, మరి ఈ విషయంలో ఇలా ఎందుకు స్పందించింది అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news