వైసీపీ నేతలకు వేల కోట్ల ప్రాజెక్టులు.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులకు కేసీఆర్ పరోక్ష సహకారం ఉందని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ వాయిదాకు సీఎం లేఖ రాయడమే దీనికి నిదర్శనమన్నారు. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు తొక్కిపెట్టారుని ప్రశ్నించారు.

revanth-reddy
revanth-reddy

లక్షా 7 వేల ఎకరాలకు సాగునీరు రాకుండా చేసిన పాపం సీఎందేనని ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి పథకం సామర్థ్యం ఒక టీఎంసీ తగ్గించారని పేర్కొన్నారు. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే ప్రారంభించాలని కోరారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై సుప్రీంలో వేసిన కేసులో పసలేదన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల్లో వైఎస్ఆర్సిపి కీలక నేతలు వేల కోట్ల పనులు చేస్తున్నారని వివరించారు. గత కొద్దిరోజులుగా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం రాజుకుంది. చివరికి సుప్రీంకోర్టు కు ఈ వివాదం చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news