ఏపీ రాజకీయాల్లో సంచలనంగా విజయసాయి ట్వీట్

-

ఆంధ్రప్రదేశ్ లో బిజెపి టీడీపీ మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన పరోక్ష వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఆయన ఉదయం ఒక ట్వీట్ చేసారు. “ఏడాది కాలంగా తినడానికి ఏమీ దొరక్క నక నక లాడుతున్న టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోంది. ఇప్పటికే కొన్ని మిడతలు ఆపార్టీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్న విషయం గ్రహించేలోగానే మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయి.

ఈ విపత్తు నుంచి బిజెపి ఎలా బయటపడుతుందో చూడాలి” అని ఆయన టీడీపీ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు. దీనితో అసలు ఆయన అలా వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏంటీ అనేది ఇప్పుడు ఎవరికి అర్ధం కావడం లేదు. బిజెపి టీడీపీ దగ్గర అయితే వైసీపీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అందుకే ఆయన ముందే బిజెపిని టీడీపీ ని దూరం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు అంటూ పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news