హుజురాబాద్ ఉప ఎన్నిక పై రాములమ్మ సంచలన వ్యాఖ్యలు

-

ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్రస్టేషన్లో ఉన్నాడని.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల గెలవబోతున్నాడని బీజేపీ నేత విజయ శాంతి స్పష్టం చేశారు. బండి సంజయ్ సంగ్రామ యాత్ర పాటల సీడీ, పుస్తకాలను ఇవాళ విడుదల చేశారు విజయ శాంతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంగ్రామ యాత్ర పాటలను గ్రామగ్రామనికి తీసుకెళ్ళాలని.. దగా పడిన తెలంగాణను బీజేపీ మాత్రమే రక్షించగలుగుతోందన్నారు.

ఈటల విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నానని కేసీఆర్ కు త్వరలోనే అర్థమవుతుందని.. ఏడేళ్ళ కేసీఆర్ పాలనలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేర లేదని తెలిపారు. కేంద్ర పథకాలను సీఎం కేసీఆర్ తెలంగాణలో తొక్కిపెడ్తున్నాడని.. బండి సంజయ్ పాదయాత్ర తెలంగాణలో సమూల మార్పునకు నాంది కాబోతోందన్నారు.

రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని.. తెలంగాణ ప్రజలకు సురక్షిత పాలన అందటం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దోపిడీకి చిరునామాగా మారాయని.. బండి సంజయ్ పాదయాత్ర విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఉంటోందన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version