తెలంగాణ ఆసుపత్రుల్లో విపరీతంగా పెరిగిన మందుల కొరత..!

-

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత విపరీతంగా పెరిగిపోయింది. వైద్యులు ప్రిస్క్రిప్షన్ లో పది రకాల మందులు రాస్తే కేవలం రెండు మూడు రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. గుండె సంబంధిత, షుగర్, శ్వాస సంబంధిత, న్యూరాలజీ, నెఫ్రాలజీ… ఇలా ఖరీదైన మందులేవి అందుబాటులో లేవు. ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత ఉండటంతో బయట కొనుగోలు చేసుకోమని చెబుతున్నారు వైద్యులు.

బిపి, షుగర్, నొప్పుల మందులు, ఇతర ఐరన్, కాల్షియం, వంటి రోజువారీ మందులు కూడా లభించడం లేదు. గతంలో కనీసం 10, 15 రోజులకి సరిపడా మందులను ఇచ్చేవారు.. ఇప్పుడు ఐదు రోజుల ముందులను కూడా ఇవ్వడం లేదంటున్నారు రోగులు. దీంతో పేషంట్స్ బయట మెడికల్ షాప్స్ లో మందులు కొనుగోలు చెయ్యలేక విపరీతమైన ఆర్థిక భారం అవుతోంది. డాక్టర్ మందుల చీటీ పై బ్రాండెడ్ ఔషధాలను రాయకూడదని… కేవలం జనరిక్ మందులను మాత్రమే రాయాలన్నా ఆదేశాలను వైద్యులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version