`ధరలు అన్ని పై పైకే.. ఇదేనేమో కేసీఆర్ బంగారు తెలంగాణ`: విజయశాంతి

-

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు విజయశాంతి పెట్టింది పేరు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి హీరోలకు ఏమాత్రం తీసిపోని విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లడంతో దాదాపు 13 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా కేసీఆర్ ప్రభుత్వంపై సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ‘అన్ని ధరలు పెంచుకుంటూ పోతూ టీఆర్ఎస్ పభ్రుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోంది. కేసీఆర్ చెప్పిన బంగారు తెలం గాణ అంటే ఇదేనేమో’ అని ఆమె ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఆమె ఓ ప్రకటన పెట్టారు.

 

ఆర్టీసీ సమ్మెను సాకుగా చూపి టికెట్టు ధరలు పెంచారని, ఆ తర్వాత పాల ధరను పెంచారని, తాజాగా విద్యుత్ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. ఓ వైపు దుబారా, మరోవైపు అప్పులతో చివరికి కేసీఆర్ దొరగారు ప్రభుత్వాన్ని నడపలేనని చేతులెత్తేసినా ఎత్తేయవచ్చునని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం దుబారా ఖర్చులను సామాన్యుడి నడ్డి విరిచి భర్తీ చేస్తున్నట్లుందని ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news