మోహ‌న్‌బాబు ఇంటికి కాఫీ తాగ‌డానికే వెళ్లాను : మంత్రి పేర్ని నాని

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రో వివాదం తెర మీదుకు వ‌చ్చింది. టాలీవుడ్ న‌టుడు మోహ‌న్ బాబు ఇంటికి మంత్రి పేర్నీ నాని వెళ్ల‌డం.. మంచు విష్ణు ట్వీట్ చేయ‌డం.. కాసేప‌టికి ఆ ట్వీట్ ను ఎడిట్ చేయ‌డంతో ఈ వివాదానికి తెర లేచింది. టాలీవుడ్ సినీ పెద్ద‌లు ఏపీ సీఎం జ‌గ‌న్ వ‌ద్దకు వెళ్లి సినీ స‌మ‌స్య‌లు, టికెట్ల ధ‌రల గురించి చ‌ర్చించారు. అయితే ఈ స‌మావేశం జ‌రిగిన మ‌రుసటి రోజే మంత్రి పేర్ని నాని.. మోహ‌న్ బాబు ఇంటికి వెళ్ల‌డంతో టాలీవుడ్ తో పాటు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయాల్లో ప‌లు సందేహాలు వ‌చ్చాయి.

అలాగే మంచు విష్ణు.. టాలీవుడ్ పెద్ద‌లు, ఏపీ సీఎం జ‌గ‌న్ తో జ‌రిగిన స‌మావేశంపై అప్ డేట్ ఇచ్చినందుకు మంత్రి పేర్నీ నానికి కృత‌జ్ఞ‌త‌లు అంటు ట్వీట్ చేశాడు. అనంత‌రం ఆ ట్వీట్ మంచు విష్ణు ఎడిట్ చేశాడు. ఇక్కడే వివాదానికి కార‌ణం అయింది. కాగ దీనిపై మంత్రి పేర్నీ నాని స్పందించారు. త‌న‌ను మోహన్ బాబు కాఫీ త‌గ‌డానికి మాత్ర‌మే ఆహ్వానించార‌ని అన్నారు. అలాగే టాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో జ‌రిగిన భేటీ గురించి ఎవరికీ సమాధానం, వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ వాళ్లు త‌మ‌కు న్యాయం జ‌రిగింద‌ని అంటున్నార‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news