ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌రువాత జ‌మ్మూకాశ్మీర్ ఎలా మారబోతుందో తెలుసా..?

-

ఎంతో కాలంగా అప‌రిష్కృతంగా ఉన్న కాశ్మీర్ స‌మ‌స్య‌కు భార‌త ప్ర‌భుత్వం ఎట్టకేల‌కు ప‌రిష్కారం చూపింది. ఆ రాష్ట్రానికి స్వ‌యం ప్ర‌తిప‌త్తిని క‌ల్పించే ఆర్టిక‌ల్ 370ని కేంద్రం ర‌ద్దు చేసింది.

ఎంతో కాలంగా అప‌రిష్కృతంగా ఉన్న కాశ్మీర్ స‌మ‌స్య‌కు భార‌త ప్ర‌భుత్వం ఎట్టకేల‌కు ప‌రిష్కారం చూపింది. ఆ రాష్ట్రానికి స్వ‌యం ప్ర‌తిప‌త్తిని క‌ల్పించే ఆర్టిక‌ల్ 370ని కేంద్రం ర‌ద్దు చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఈ విష‌యంపై గెజిట్ నోటిఫికేష‌న్ ఇచ్చారు. ఇక రాజ్య‌స‌భ‌లో జ‌మ్మూకాశ్మీర్ విభ‌జ‌న బిల్లును కూడా ఆమోదించారు. ఈ క్ర‌మంలో లోక్‌స‌భ‌లో మంగ‌ళ‌వారం బిల్లు ఆమోదం పొందితే చాలు. అయితే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నేప‌థ్యంలో జ‌మ్మూకాశ్మీర్‌లో ఎలాంటి మార్పులు వ‌స్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

what are the changes that jammu and kashmir will get after article 370 revoke

* ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంగా ఉన్న జ‌మ్మూకాశ్మీర్ కేంద్ర‌పాలిత ప్రాంతంగా మారుతుంది. ఢిల్లీ, పుదుచ్చేరి త‌ర‌హాలో జ‌మ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. దీనిపై కేంద్రానికి ప్ర‌త్యేక అధికారాలు ఉంటాయి.

* దేశానికి సంబంధించి పార్ల‌మెంట్‌లో చేసే ఏ చ‌ట్ట‌మైనా స‌రే.. ఇక‌పై జ‌మ్మూ కాశ్మీర్‌లోనూ అమ‌ల‌వుతుంది.

* జ‌మ్మూకాశ్మీర్‌, ల‌దాఖ్ కేంద్ర‌పాలిత ప్రాంతాలు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ల ఆధీనంలోకి వ‌స్తాయి. ఈ క్రమంలో జ‌మ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల‌పై అంతిమ పాల‌నాధికారం ఉంటుంది.

* జ‌మ్మూ కాశ్మీర్‌కు సంబంధించి ప్ర‌తి అంశంలోనూ కేంద్ర హోం శాఖ‌కు విశేషమైన అధికారులు ఉంటాయి.

* జ‌మ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఉన్నా అది ఢిల్లీలాగే ఉంటుంది. అంటే ఆ రాష్ట్ర ప్ర‌భుత్వానికి పోలీసు యంత్రాంగం, భూముల నిర్వ‌హ‌ణ త‌దిత‌ర అంశాల‌పై అధికారాలు ఉండ‌వు.

* జమ్మూకాశ్మీర్‌లో ఉండే స్థిర నివాసులకు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ భూముల క్ర‌య విక్ర‌యాల‌ను జ‌రిపే హ‌క్కు ఉండేది. కానీ ఇప్పుడు దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన ప్ర‌జ‌లైనా అక్క‌డ భూముల‌ను కొన‌వ‌చ్చు, అమ్మ‌వ‌చ్చు.

* ల‌దాఖ్ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉండ‌వు. కానీ ఆ ప్రాంత ప్ర‌జ‌లు లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్రం త‌మ ఓటు హ‌క్కును ఉప‌యోగించుకుంటారు.

* జ‌మ్మూకాశ్మీర్‌కు, ల‌దాఖ్‌కు ఇక‌పై నేరుగా సంబంధాలు ఉండ‌వు. ల‌దాఖ్ ప్రాంత అభివృద్ధిని కేంద్రం చూసుకుంటుంది.

* ఇప్ప‌టి వ‌ర‌కు జ‌మ్మూకాశ్మీర్‌కు జాతీయ ప‌తాకం వేరేగా ఉండేది. కానీ ఇక‌పై ఉండ‌దు. అయితే ఇప్ప‌టికీ జాతీయ ప‌తాకం కావాలంటే.. అందుకు పార్ల‌మెంట్ అనుమ‌తి త‌ప్ప‌నిసరి.

Read more RELATED
Recommended to you

Latest news