మహిళలంటే టీడీపీకి చులకన….అందుకే వారిపై దాడులు

-

మహిళలు ఎక్కడ ఆరాధింపడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అంటారు.అందులోనూ సంప్రదాయాలను పాటించే ఏపీలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. గౌరవం కూడా దక్కుతుంది.మహిళల ప్రాముఖ్యతను గుర్తించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి సంక్షేమ పథకాలలో అగ్రతాంబూలం ఇచ్చారు.ఆఖరికి ఇళ్లను కూడా మహిళల పేరుతోనే ఇవ్వడం జగనన్నకే దక్కిన ఘనత. అందుకే వైసీపీకి మహిళల ఆదరణ పెరుగుతోంది.ఈ ఎన్నికల్లో ఆయనకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు.

ఇదిలా ఉంటె టీడీపీ అడుగడుగునా మహిళలను అవమానాలకు గురిచేస్తోంది.అణా ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో మగువలకు విలువ లేకుండాపోతోంది.మహిళలే టార్గెట్ గా టీడీపీ దాడులకు పాల్పడుతోంది.మహిళలపై టీడీపీ వరుస దాడులు చేయడం ఇటీవల వెలుగుచూస్తోంది.
ఇవాళ మాచర్ల నియోజకవర్గం వెల్దుర్ది మండలంలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమ్యపై దాడి జరిగింది. అంతేకాదు నిన్న హోంమంత్రి తానేటి వనతిపై గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలో దాడి వెలుగుచూసింది.నిన్ననే విజయవాడలో బోండా ఉమ అనుచరులు వైయస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై దాడికి పాల్పడిన సంఘటన మనము చూశాం. అంతకుముందు మంత్రి బాలినేని కోడలుపై ఒంగోలులో దాడి కూడా జరిగింది. ఈ సంఘటనల వెనుక టీడీపీ హస్తం ఉంది అనేది అందరికీ తెలిసిందే.

కాగా టీడీపీ చేస్తున్న దాడులపై మహిళలోకం మండిపడుతోంది.తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఏమాత్రం గౌరవం లేదు అనేందుకు దివ్యవాని,యామిని శర్మల ఉదంతాలను గుర్తుచేస్తున్నారు.ఈ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి,,,,మహిళలు వైసీపీ వెంట ఉండటాన్ని జీర్ణించుకోలేక దాడులకు పాల్పడుతున్నారని టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు రక్షణ ఉండదని,ఈ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలను కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news