చంద్రబాబు పరువు తీసేసిన వైసీపీ లేడీ ఎమ్మెల్యే

-

చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీ టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ చేయాల్సింది ఇదేనా అంటూ విమర్శలు గుప్పించారుగాంధీ జయంతి రోజున ప్రభుత్వం మద్యం అమ్మిందని చంద్రబాబు మాట్లాడారనిఎక్కడ అమ్మకాలు జరిగాయో వచ్చి చూపట్టే దమ్ముందా అని సవాలు విసిరారుప్రజా రంజక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంచిపేరు రావడం చూసి ఓర్వలేక చంద్రబాబు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

ఏపీలో అక్టోబర్‌ 2న మద్యం దుకాణాలు ఓపెన్‌ చేశారని… మద్యం పోలీసుల ద్వారా సరఫరా చేస్తున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారుగాంధీజీవి సత్యంఅహింస మార్గాలు అయితే.. చంద్రబాబుది అసత్యంహింసామార్గమని ఎమ్మెల్యే రజని అన్నారుఅక్టోబర్‌ లాంటి పవిత్రమైన రోజును కూడా హేళన చేస్తూ మందు అమ్ముతున్నారని మాట్లాడిన చంద్రబాబును శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

అబద్ధమా.. అబద్ధమా నువ్వు ఎందుకు నవ్వుతున్నావంటే.. చంద్రబాబును చూసి నవ్వుతున్నానని చెప్పిందంట’ చంద్రబాబును చూసి అబద్ధం కూడా నవ్వే పరిస్థితి వచ్చిందన్నారుజగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలోని 43 వేల బెల్టుషాపులు మూతపడ్డాయి. 40,380 పర్మిట్‌ రూంల లైసెన్స్‌లు కూడా రద్దయ్యాయిదశలవారి మద్య నిషేధ పథకంలో భాగంగా 20 శాతం దుకాణాలను కూడా సీఎం తగ్గించారని రజని గుర్తు చేశారు.

గత ఐదేళ్లు చేసిన మోసాలకు తెలుగుదేశం పార్టీని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారన్నారుఅయినా చంద్రబాబులో మార్పు రాకపోవడం బాధాకరమన్నారుగాంధీ జయంతి రోజున చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధాకరమనిలేనిది ఉన్నట్లుగా ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news