స్వ‌శ‌క్తితో ఎదుగుద‌లే యువ‌త‌కు ప్ర‌ధాన ల‌క్ష్యం కావాలి

-

శ్రీ‌కాకుళం న‌గ‌రం : స్వ‌శక్తితో ఎదుగుదలే యువ‌త‌కు ప్ర‌ధాన ల‌క్ష్యం కావాలి అని శ్రీ‌కాకుళం శాస‌న స‌భ్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. స్థానిక మూర్తి పెట్రోల్ బంక్ ఎదురుగా కొత్తగా నెలకొల్పిన ఇంటీరియ‌ర్ క్యూబ్ (గృహాలంక‌ర‌ణ‌కు సంబంధించిన కార్యాల‌యం) కార్యాల‌యాన్ని ప్రారంభించి నిర్వాహ‌కుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఆధునిక పోక‌డ‌ల‌కు అనుగుణంగా ఇటువంటి ఇంటీరియ‌ర్ డిజైనింగ్ ఆఫీసులు శ్రీ‌కాకుళం న‌గ‌రంలో నెల‌కొల్ప‌డం శుభ ప‌రిణామం అని అన్నారు.

రానున్న రోజుల్లో ఇంటీరియ‌ర్ డిజైన‌ర్స్ కు మ‌రిన్ని మంచి అవకాశాలు రానున్నాయ‌ని,వాటిని స‌ద్వినియోగం చేసుకుని వినియోగ‌దారుల మ‌న్న‌న‌లు అందుకోవాల‌ని కోరారు. అనంత‌రం నిర్వాహ‌కులు ధ‌ర్మాన‌ను స‌త్క‌రించి కృత‌జ్ఞత‌లు తెలిపారు.అతిథులకు వేదాశీర్వ‌చ‌నం అందించారు వైదికులు.కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ మెంటాడ వెంక‌ట ప‌ద్మావ‌తి,వైసీపీ యువ నాయ‌కులు చౌద‌రి స‌తీశ్, క‌ళింగ కోమ‌టి కార్పొరేష‌న్ చైర్మ‌న్ అంధ‌వ‌ర‌పు సూరిబాబు,శిమ్మ రాజ‌శేఖ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news