ఆ ఉద్యోగుల కుటుంబాలకు జగన్ మరో వరం

-

ఏపీ సీఎం జగన్ ఉద్యోగస్తులకు చేతికి ఎముక లేకుంజా వరాలు ఇస్తున్నారు. ఇటీవలే హోంగార్డులకు రోజువారి వేతనాన్ని కొంత మేర పెంచారు. తాజాగా ఆయన హోంగార్డు కుటుంబాలకు మరో వరం ప్రకటించారు. అదేమిటంటే.. విధినిర్వహణలో హోంగార్డు మరణిస్తే వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

పేరుకు ఖాకీ డ్రస్సు ఉన్నా హోంగార్డుల జీవితాలు ఎంత కష్టదాయంకంగా ఉంటాయో తెలిసిందే. పోలీసు శాఖలో అతి తక్కువ వేతనాలు పొందేది వీరే. అందుకే విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో జగన్ వీరికి ఈ వరం ఇచ్చారు.

ఈ సందర్భంగా జగన్ పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజలకు పోలీసులు చేస్తున్న సేవలను జగన్ మెచ్చుకున్నారు. విధి నిర్వహణలో ఎంతోమంది పోలీసులు అమరులయ్యారని గుర్తు చేశారు.

అందుకే.. పోలీసులు కూడా వారానికి ఒకరోజు కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలనే వీక్లీ ఆఫ్ ఇస్తున్నామని జగన్ ప్రకటించారు. పోలీసు అమరవీరుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు జగన్. పోలీసులు ప్రజల గౌరవం, మన్ననలు పొందేలా పని చేయాలని జగన్‌ ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news