ఓటేసిన వైఎస్ జగన్.. నిర్భయంగా ఓటేయండి..!

-

సమాజంలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా, నిర్భయంగా ఓటేయాలి.. అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కడప జిల్లా పులివెందులలో జగన్, ఆయన భార్య భారతి ఓటు హక్కును వినియోగించుకున్నారు.


ఓటేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజంలో మార్పు రావాలని కోరుకునే ప్రతి ఒక్కరు ఓటేయండి. నిర్భయంగా ఓటేయండి. మార్పు కోసం ఓటేయండి. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. దేవుడి దయ వల్ల రాష్ట్రంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా.. అని జగన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version