“వాళ్ళ సంగతి ఏంటో అర్జెంట్ గా చూడండి .. తప్పు ఎవరిదో నాకు తెలియాలి” వై ఎస్ జగన్ సీరియస్ ఆర్డర్స్ !!

-

ఇటీవల వైసిపి పార్టీ నాయకులు టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, మంత్రి మోపిదేవి వెంకటరమణ, తోట త్రిమూర్తులు కలిసి ద్రాక్షారామానికి వెళ్లారు. ఈ సందర్భంలో వైసీపీ నేత తోట త్రిమూర్తులకి చేదు అనుభవం ఎదురయింది. గోదావరి జిల్లా ద్రాక్షారామంలో తోట త్రిమూర్తులు కారు దిగుతుండగా ఒక వ్యక్తి చెప్పుతో దాడి చేసిన ఘటన వైసిపి పార్టీ లో సంచలనం సృష్టించింది. విషయంలోకి వెళితే కె. గంగవరం మండలంలోని మసకపల్లికి చెందిన ఇజ్రాయెల్ తోట త్రిమూర్తులు కారు దిగుతున్న సమయంలో చెప్పుతో దాడి చేయటానికి ప్రయత్నాలు చేశాడు. Image result for ys jagan

తోట త్రిమూర్తులు భద్రతా సిబ్బంది క్షణాల్లోనే స్పందించి ఇజ్రాయెల్ ను అక్కడి నుండి నెట్టివేశారు. ఇజ్రాయెల్ ఎందుకు తోట త్రిమూర్తులుపై దాడి చేసే ప్రయత్నం చేశాడనే విషయం తెలియాల్సి ఉంది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వైఎస్ జగన్ దాకా వెళ్లిందట. దీంతో వెంటనే వైఎస్ జగన్ అసలు విషయం తెలుసుకున్నారు అన్ని పార్టీలో టాక్.

 

వైసీపీ నేత తోట త్రిమూర్తులు పై వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేణు వర్గం అనుచరుడు ఇజ్రాయేల్ కావాలని దాడి చేసినట్లు జగన్ దృష్టికి వెళ్లడంతో..” వాళ్ళ సంగతి ఏంటో అర్జెంట్ గా చూడండి .. తప్పు ఎవరిదో నాకు తెలియాలి ” అంటూ తూర్పుగోదావరి జిల్లా వైసిపి సీనియర్ నాయకులకు వై ఎస్ జగన్ సీరియస్ ఆర్డర్స్ ఇచ్చినట్లు సమాచారం. అయితే గతంలో తోట త్రిమూర్తులు దళితులకు శిరోముండనం చేశారనే ఆరోపణలతో కేసు నమోదు కావడంతో దళితుడైన ఇజ్రాయెల్ తోట త్రిమూర్తులు పై దాడి చేశాడని ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది నేతలు కామెంట్ చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news