నేటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి ఆత్మీయ సమావేశాలు

-

ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంటే.. మరోవైపు నేటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని పొంగులేటి నిర్ణయించారు.

నేడు పినపాక నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మొదటి సమ్మేళనం జరగనుంది. ఆత్మీయ భేటీకి భారీగా జన సమీకరణకు పొంగులేటి వర్గం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయ అడుగులపై రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

ఈ ఆత్మీయ భేటీలో పొంగులేటి ప్రసంగంపై సర్వత్రా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు నిన్న ఉమ్మడి జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ భేటీలో పొంగులేటి ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. మరోవైపు ఈనెల 18న జరగనున్న ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ కూడా ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news