గాంధీ భవన్ వద్ద పొన్నాల లక్ష్మయ్య వీరంగం

-

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. తెలంగాణలోని 238 ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ వేళ గాంధీ భవన్ వద్ద మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వీరంగం సృష్టించారు.

జనగామ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ రెడ్డిని ఓటు వేయకుండా పీఆర్వో అడ్డుకోవడంపై పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 ఏళ్లుగా కాంగ్రెస్‌ లో ఉన్న వ్యక్తికి అవమానం జరిగిందని ఫైర్ అయ్యారు. ఓటరు లిస్టు నుంచి శ్రీనివాస్‌ రెడ్డి పేరును చివరి క్షణంలో ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. పీఆర్వోతో వాగ్వాదానికి దిగిన పొన్నాలను సీనియర్‌ నేత జానారెడ్డి సముదాయించి అక్కడినుంచి తీసుకెళ్లారు.

అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రతి నియోజకవర్గంనుంచి ఇద్దరికి అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య, చెంచారపు శ్రీనివాస్‌ రెడ్డికి ఏఐసీసీ ఓటింగ్‌ కార్డు జారీ చేసింది. గత రాత్రి శ్రీనివాస్‌ రెడ్డి స్థానంలో కొమ్మూరు ప్రతాప్‌ రెడ్డి పేరును రాష్ట్ర నాయకత్వం చేర్చింది. దీంతో ఓటు వేయడానికి గాంధీభవన్‌కు వచ్చిన శ్రీనివాస్‌ రెడ్డిని పీఆర్వో సిబ్బంది అడ్డుకున్నారు.

దీనిపై అక్కడే ఉన్న పొన్నాల లక్ష్మయ్య.. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే కొమ్మూరి పేరును ఎలా చేర్చుతారని ప్రశ్నించారు. శ్రీనివాస్‌ రెడ్డికి ఓటువేసే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్‌ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి ఇద్దిరినీ ఓటేయకుండా పీఆర్వో సిబ్బంది ఆపేశారు.

Read more RELATED
Recommended to you

Latest news