గుడ్ న్యూస్.. పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు..!

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పోస్ట్ ఆఫీసు లో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంచారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఇండియా పోస్ట్ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది పోస్ట్ ఆఫీస్.

గడువు 2021 మే 26న ముగియడం తో అప్లై చేయని వారికి మరో అవకాశం కల్పిస్తోంది. దరఖాస్తు గడువును 2021 జూన్ 25 వరకు పొడిగించడం తో జూన్ 25 సాయంత్రం 5 గంటల్లోగా అప్లై చేసుకో వచ్చు. అభ్యర్థుల వయస్సు 2021 మే 26 నాటికి 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి.

ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 ఏళ్లు వయస్సు లో సడలింపు ఉంటుంది. స్పీడ్ పోస్టు ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. దీనిలో మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి.

చెన్నై లోని మెయిల్ మోటార్ సర్వీసులో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. 10వ తరగతి పాస్ అయిన వారు ఈ పోస్టులకి అర్హులు. అభ్యర్థులకు మూడేళ్ల లైట్, హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు లేదు.

పూర్తి వివరాలను https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్‌ లో తెలుసుకో వచ్చు. దరఖాస్తుల్ని పంపాల్సిన అడ్రస్: The Senior Manager, Mail Motor Service, No.37 (Old No.16/1) Greams Road, Chennai-600 006

Read more RELATED
Recommended to you

Latest news