పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి కాల‌జ్ఞానంలో చెప్పిన‌వ‌న్నీ జ‌రిగాయి.. క‌రోనా గురించి కూడా చెప్పారా..?

-

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచానికి నిద్ర లేకుండా చేస్తోంది.. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌దు.. వైర‌స్ మ‌న‌కు వ్యాపిస్తుందా, మ‌నం సుర‌క్షితంగా ఉంటామా.. అన్న భ‌యం ప్ర‌జ‌ల్లో నెల‌కొంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 3 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు కాగా, 13వేల మందికి పైగా చ‌నిపోయారు. దీంతో ప్ర‌పంచం మొత్తం అల‌ర్ట్ అయ్యింది. అయితే క‌రోనా ఏమోగానీ.. ఒక‌ప్పుడు పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి చెప్పిన కాల‌జ్ఞానం ఇప్పుడు నిజ‌మైంద‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి.

pothuluri veerabrahmendra swamy said things in kalagnanam have done and what about corona virus

ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను
లక్షలాది ప్రజలు సచ్చేరయ
కోరంకియను జబ్బు కోటిమందికి తగిలి
కోడిలాగ తూగి సచ్చేరయ !!శివ!! 114

పైన తెలిపింది.. వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి ర‌చించిన కాల‌జ్ఞానంలోని ప‌ద్యం.. అందులో కోరంకి అనే జ‌బ్బుతో ప్ర‌జ‌లు చ‌నిపోతార‌ని, అది ఈశాన్య దిక్కున పుడుతుంద‌ని ఉంది. అయితే చైనా కూడా మ‌న‌కు దాదాపుగా ఈశాన్య దిక్కునే ఉంటుంది. ఇక ప్ర‌స్తుతం ఉన్న క‌రోనా పేరుకు కోరంకి అనే పేరుకు చాలా ద‌గ్గ‌రి పోలిక ఉంది. దీంతో వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి చెప్పింది నిజ‌మేన‌ని తెలుస్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న తన కాల‌జ్ఞానంలో చెప్పిన‌వి నిజంగానే జ‌రిగాయి. అవేమిటంటే…

* భార‌త‌దేశాన్ని ఓ అంబ (మ‌హిళ‌) 16 ఏళ్ల పాటు పాలిస్తుంద‌ని చెప్పారు. (ఇందిరాగాంధీ మ‌న దేశాన్ని దాదాపుగా 15 సంవ‌త్స‌రాల పాటు పాలించారు.)

* తెర‌మీద క‌దిలే బొమ్మ‌లు (సినిమా న‌టులు) గ‌ద్దెనెక్కుతాయి. ప్ర‌జ‌ల‌ను పాలిస్తారు. రంగుల‌ను చూసి ప్ర‌జ‌లు మోస‌పోతారు. (సినీ న‌టులు ప్ర‌జా ప్ర‌తినిధులై రాష్ట్రాల‌ను పాలించారు.)

* దేశంలో రాజ‌రికాలు, రాజుల పాల‌న ఉండ‌వు. (ప్ర‌స్తుతం మ‌న దేశంలో ఎక్క‌డా రాజుల పాల‌న లేదు)

* ఆకాశంలో ప‌క్షి వాహ‌నాలు కూలి అనేక మంది చ‌నిపోతారు. (విమానాలు కూలి ప్ర‌యాణికులు మ‌ర‌ణిస్తున్నారు)

* స‌మాజంలో జ‌నాభా పెరుగుతుంది. (ప్ర‌స్తుతం ప్ర‌పంచ జ‌నాభా చాలా బాగా పెరుగుతోంది)

* బ్రాహ్మ‌ణ అగ్ర‌హారాలు న‌శిస్తాయి. (ఇప్పుడు దాదాపుగా దేశంలో ఎక్క‌డా బ్రాహ్మ‌ణ అగ్ర‌హారాలు లేవు)

* భాగ్య‌న‌గ‌రంలో తుర‌క‌లు, హిందువులు ఒక‌రినొక‌రు నరుక్కుని చ‌చ్చిపోతారు. (హైద‌రాబాద్‌లో గ‌తంలో మ‌త క‌ల్లోలాల కార‌ణంగా అనేక మంది చ‌నిపోయారు)

* పాపాత్ముల వ‌ల్ల ఆల‌యాలు నాశ‌న‌మ‌వుతాయి. దేవ‌త విగ్ర‌హాల‌ను దొంగిలిస్తారు. ( దేశంలో ఇప్ప‌టికే అనేక చోట్ల ఆల‌యాలు ధ్వంస‌మ‌య్యాయి. దేవతా విగ్ర‌హాల‌ను చోరీ చేశారు.)

* చిత్ర‌విచిత్ర‌మైన యంత్రాలు వ‌స్తాయి.. కానీ చావు, పుట్టుక‌ల‌ను మాత్రం క‌నిపెట్ట‌లేక‌పోతారు. (ప్ర‌స్తుతం అనేక ర‌కాల సాంకేతిక ప‌రికరాలు, అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ అందుబాటులో ఉంది. అయినా మ‌నుషుల్ని పుట్టించే యంత్రాల‌ను (మ‌నిషి స‌హాయం లేకుండా) క‌నిపెట్ట‌లేక‌పోయారు. అలాగే మ‌నిషి మ‌ర‌ణాన్ని ఆప‌లేక‌పోయారు.)

ఈ క్ర‌మంలోనే ఒక‌ప్పుడు వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి చెప్పిన‌ట్లే ఇప్పుడు క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని నాశ‌నం చేస్తుంద‌ని ప్రచారం జ‌రుగుతోంది..!

Read more RELATED
Recommended to you

Latest news