ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు ఆవిరి అయ్యాయా..!!

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ”ఆదిపురుష్”. ఇది వచ్చే సంక్రాంతి కానుక గా రిలీజ్ చేద్దామని అనుకుంటే గ్రాఫిక్స్ వర్క్ కోసం రిలీజ్ వచ్చే సంవత్సరం జూన్ కు వాయిదా వేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాల తో వుంటే  ప్రమోషన్స్ లో భాగంగా  రిలీజ్ చేసిన టీజర్  లో గ్రాఫిక్స్ నాసిరకం అని సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. అలాగే చాలా మంది   హిందూ దేవుళ్లను కించ పరిచేలా వుందని విమర్శించారు.

ఈ సినిమా  గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో మళ్లీ VFX వారితో మాట్లాడి, మంచిగా వచ్చేలా చేయటం కోసం డైరెక్టర్ ఓం రౌత్ నిర్మాత తో మాట్లాడి మరో వంద కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. తేజ సజ్జ హునుమన్ సినిమా వచ్చాక  ఆదిపురుష్ టీజర్ పై మరోసారి మరోసారి ట్రోల్ జరిగింది. అయితే ఈ విషయంలో ప్రభాస్ చాలా సీరియస్ గా ఉన్నాడట. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఉండాలని మరోసారి డైరక్టర్ కు చెప్పాడట.

దీనితో జనవరి నుంచి జూన్ కి వాయిదా పడిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడనున్నట్టుగా పలు రూమర్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. దీనితో ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది నుంచి ఏకంగా ఆ వచ్చే ఏడాదిలోనే వస్తుందని టాక్ నడుస్తోంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా ”ఆదిపురుష్” విడుదల అయ్యే అవకాశం లేదని ఆ సినిమా పై ఆశలు లేకుండా పోయాయి. ఇక వచ్చే సంవత్సరం లో రిలీజ్ అయ్యే ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో వస్తున్న సలార్ సినిమా పై హోప్స్ పెట్టుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news