కొత్త బిజినెస్ పెట్టిన కంచె హీరోయిన్..! అప్పుడే రుచి చూయించేసిందిగా..!

-

కంచె సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన జబల్ పూర్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు కొత్త రూట్ ఎంచుకుంది. తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఓ యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. ఈ ఛానల్ ద్వారా తనకు ఇష్టమైన వెరైటీ వంటలను అభిమానులకు రుచి చూపిస్తోంది. తన మొదటి ఎపిసోడ్‌లో జపనీస్ చీస్ కేక్‌ను తయారు చేసి చూపించింది. ఈ వీడియోను ఆలా పోస్ట్ చేసిందో లేదో అంతే పెద్ద ఎత్తున ట్రాఫిక్ వస్తోంది.

కాగా, లాక్‌డౌన్ వేళ మళ్లీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకునేందుకు.. తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది భామ. అందుకోసం హాట్ హాట్ ఫొటోషూట్‌లతో ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పుట్టిస్తోంది. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో ప్రగ్యాకు అవకాశం వచ్చినట్లు సమాచారం. అంతేకాదు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో ఈమె పేరును పరిశీలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news