సర్పంచ్ గా కుడా..పీయూష్ గోయల్ పనికిరాడు – మంత్రి వేముల

-

సర్పంచ్ గా కుడా..పీయూష్ గోయల్ పనికిరాడని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ నగరం ఎన్టీఆర్ చౌరస్తాలో జరిగిన దీక్షలో పాల్గొన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే తెలంగాణ రైతులకు ఈ పరిస్థితి వచ్చింది..తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసి కేంద్రం, బీజేపీ ఓర్వలేకనే 2 సంవత్సరాల నుండే మోడీ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందన్నారు.

కేంద్రం తమ బాధ్యతల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తోందని.. సమస్య పరిష్కారానికి చివరి వరకు కొట్లాడాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ మంత్రుల బృందంపై కేంద్ర మంత్రి అవమానకరంగా మాట్లాడినారని.. బండి సంజయ్ అన్న మాటలు, బీజేపీ ఎంపీలు వరి వేయమని చెప్పిన మాటలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు.

నూకల బియ్యాన్ని అలవాటు మీ ప్రజలకు అలవాటు చేయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రం పై ఎందుకు విమర్శలు చేయడం లేదో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పాలి..కేంద్రం మెడలు వంచుతాం… తెలంగాణ రైతులు పండించిన పంటలకు కొనుగోలు చేయిస్తామని స్పష్టం చేశారు. రైతుల పక్షాన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడరు…ఈసారి కేంద్ర ప్రభుత్వంను వదిలిపెడితే ప్రతి యాసంగికి ఇదే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news