రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయానికి నేడు ప్రీబిడ్‌

-

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం, గాజులరామారం టౌన్‌షిప్‌ల పరిధిలో అసంపూర్తి నిర్మాణంగా ఉన్న రాజీవ్ స్వగృహ టవర్లు విక్రయానికి నేడు నేడు ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు హిమాయనగర్‌ ఉర్దూగల్లీలోని రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ కార్యాలయంలో హెచ్‌ఎండీఏ ఆ సమావేశం నిర్వహిస్తోంది.

పోచారంలో 9 అంతస్తులవి నాలుగు 4 టవర్లుఉండగా వాటిల్లో ఒక్కో టవర్‌లో కనీసం 72 నుంచి 198 ప్లాట్లు నిర్మించుకునే సదుపాయంఉంది. గాజులరామారంలో 14 అంతస్తులవి 5 టవర్లు ఉండగా వాటిల్లో ఒక్కొ టవర్‌లో 112 ప్లాట్లు నిర్మించుకునే సదుపాయం ఉంది. ఓఆర్ఆర్‌కు సమీపంలో ఉన్న పోచారం, గాజులరామారం స్వగృహ టవర్ల కొనుగోలుకు ఆసక్తి ఉన్న బిల్డర్లు, డెవలపర్లు, సొసైటీలు, వ్యక్తులు ఈనెల 30వ నాటికి 10 లక్షల ధరావత్‌ను డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. లాటరీ విధానం ద్వారా దరఖాస్తుదారులను ఎంపిక చేసి టవర్లు కేటాయిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news