అమల, నాగర్జున ల పెళ్లి చేసింది ఎవరో తెలుసా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కింగ్ నాగార్జున నవ మన్మధుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు కూతురు లక్ష్మీ ను 1984లో తండ్రి కోరిక మేరకు వివాహం చేసుకున్నాడు. కొంతకాలం ఆమెతో బాగానే సంసారం చేశాడు . 1986లో నాగచైతన్య కూడా జన్మించాడు. కానీ కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ విడిపోవాల్సి వచ్చింది.

తర్వాత 1989లో కిరాయి దాదా సినిమాలో హీరోయిన్ గా నటించిన అమలతో నాగార్జున ప్రేమలో పడ్డాడు. అయితే ఆ సమయానికి రామానాయుడు కూతురు లక్ష్మితో విడాకులు జరిగిపోయాయి. ఇక కిరాయి దాదా సినిమాను వి.దొరస్వామి రాజు నిర్మించగా.. ఏ. కోదండరామిరెడ్డి డైరెక్టర్ గా చేశారు. ఈ సినిమా తోనే రష్యా కి చెందిన అమల తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే వీరి వివాహానికి పెళ్లి పెద్దగా నిలబడింది కిరాయి దాదా మూవీ నిర్మాత దొరస్వామి రాజు. ఆయన దగ్గరుండి మరీ వీరి పెళ్లి తిరుపతిలో చేసినట్లు సమాచారం.

వి. దొరస్వామి రాజు - వికీపీడియా

అయితే అక్కినేని నాగార్జున, అమల వివాహం చేసుకున్నప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వైరల్ అయ్యాయి. అంతేకాదు విదేశాలకు చెందిన అమ్మాయిని టాలీవుడ్ హీరో వివాహం చేసుకోవడంతో పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమన్నాయి. కానీ వీరిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది.ఇక వీరిద్దరికీ పుట్టిన అఖిల్ బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మరొకవైపు నాగచైతన్య కూడా హీరోగా నటించి సమంత ను వివాహం చేసుకొని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news