నిజాలు చెప్పి చిక్కుల్లో పడ్డ పాక్ఎంపీ..దేశ ద్రోహం కేసు నమోదు…?

-

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ విడుదల గురించి చెప్పిన పాకిస్థాన్‌ ఎంపీ చిక్కుల్లో పడ్డారు. భారత్‌ తమపై ఎక్కడ దాడి చేస్తుందోనని ఆర్మీ చీఫ్‌ భయంతో వణికిపోయారని… గతిలేని పరిస్థితుల్లో అభినందన్‌ను విడుదల చేసినట్టు ఎంపీ అయాజ్‌ సాధిఖ్‌ తెలిపారు. దీంతో అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది అక్కడి ప్రభుత్వం.

ఆయనపై దేశవ్యాప్తంగా పోలీసులకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని.. ఈ నేపథ్యంలో దేశద్రోహం కేసు నమోదు చేయాలన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నామని అంతర్గత వ్యవహారాల మంత్రి ఎజా షా తెలిపారు.అలాగే అయాజ్‌ సాధిఖ్‌పై దేశవ్యాప్తంగా పోలీసులకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. సాదిఖ్‌ను ద్రోహిగా పేర్కొంటూ లాహోర్‌లో పోస్టర్లు వెలిశాయి.

Read more RELATED
Recommended to you

Latest news