ఐపీఎల్:ప్లే ఆఫ్ కి చేరిన ఢిల్లీ కేపిటల్స్‌,ఆర్సీబీ…!

-

ఢిల్లీ కేపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్ ప్లే ఆఫ్‌కు చేరాయి. నిన్న జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. ఇక ఇవాళ ముంబై-హైదరాబాద్‌ మధ్య జరిగే మ్యాచ్‌ తర్వాత… ప్లే ఆఫ్‌ నాలుగో బెర్త్‌ ఎవరిదో తేలుతుంది. బెంగళూరుపై గెలిచి రెండో స్థానాని సాధించింది ఢిల్లీ. ఇక ఢిల్లీ చేతిలో బెంగళూరు ఓడినా…మెరుగైన రన్‌రేట్‌తో ఆ టీమ్‌ కూడా ప్లే ఆఫ్‌కు చేరింది.

రెండోస్థానంలో నిలిచిన ఢిల్లీ… ఎల్లుండి ముంబైతో తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఇక ఇవాళ ముంబై-హైదరాబాద్ మధ్య జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్న దానిపైనే… ఏ టీమ్‌కు ప్లే ఆఫ్‌ నాలుగో బెర్త్‌ దక్కుతుందనేది ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ గెలిస్తే… బెంగళూరుతో శుక్రవారం ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తలపడుతుంది. ఒకవేళ ముంబై చేతిలో హైదరాబాద్‌ ఓడితే… కోల్‌కతా, బెంగళూరు మధ్య ఎలిమినేషన్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news