దేశంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు ప్రధాని మోడీకే: చేవెళ్ల బీజేపి ఎంపీ అభ్యర్థి

-

దేశంలో కుల, మతాలు, ప్రాంతీయ బేధాలకు అతీతంగా ప్రజలంతా నరేంద్ర మోడీకీ, బీజేపి కి మద్దతు పలుకుతున్నారని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.గురువారం ఆయన శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ఏరియాలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మరోసారి నరేంద్రమోడీని ప్రధానమంత్రిని చేయడానికి యావత్ దేశం మొత్తం సిద్ధమైందని తెలిపారు.

అయితే బీహెచ్ఈఎల్, చందానగర్ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని ,కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేవెళ్లను అభివృద్ధి పథంలో నడిపించొచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు ,మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news