లారీని ఢీకొట్టిన బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు

-

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ శివారులో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రయాణికులతో బస్సు రాయచూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా.. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నిజామాబాద్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేశ్‌ బాబు తెలిపారు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండి బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news