బీజేపీ మీద ప్రశాంత్ కిషోర్ సవాల్.. అదే జరిగితే తప్పుకుంటా !

-

 బెంగాల్ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్ కు వచ్చిన అమిత్ షా బీజేపీ శ్రేణుల్లో మంచి జోష్ నింపే వెళ్లారు. ఈ దెబ్బకి వచ్చే ఎన్నికల్లో బీజేపీ వెస్ట్ బెంగాల్ లో అధికారంలోకి రావడం ఖాయమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి దీంతో కొద్ది సేపటి క్రితం పొలిటికల్ స్ట్రాటజీస్ట్ ప్రశాంత్ కిషోర్ చేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారింది.

Political Strategist Prasanth Kishor

ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కోసం పని చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన బిజెపి ఈసారి బెంగాల్ లో డబుల్ డిజిట్ సీట్లు తెచ్చుకోవడం కూడా కష్టమేనని చెబుతున్నాడు. కావాలంటే ఈ ట్వీట్ సేవ్ చేసుకోండి ఒక వేళ బీజేపీ గనుక అంతకన్నా బెటర్ గా సీట్లు తెచ్చుకోగలిగితే నేను ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయటం మానేస్తాను అని అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news