ఐపీఎస్‌ అధికారిణితో పంజాబ్‌ మంత్రి వివాహం

-

డాక్టర్-డాక్టర్,యాక్టర్-యాక్టర్, ఇంజినీర్-ఇంజినీర్, ఐపీఎస్-ఐపీఎస్-ఐఏఎస్.. ఇలా ఏ రంగానికి చెందిన వాళ్లు ఆ రంగం వారినే పెళ్లి చేసుకోవడం చూసుంటాం. కానీ ఓ ఐపీఎస్ అధికారిణిని ఓ ప్రజాప్రతినిధి మనువాడటం గురించి విన్నారా..? అదేంటి ప్రభుత్వ అధికారిణితో రాజకీయ నేత పెళ్లా.. వెరైటీగా అనిపిస్తోంది కదా. ఇంతకీ ఆ నేత ఎవరంటే..?

పంజాబ్‌ రాష్ట్ర మంత్రి హర్‌జోత్‌ బెయిన్స్‌, ఆ రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిణి జ్యోతి యాదవ్​ను త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. వీరి పెళ్లి ఈ నెలలోనే జరగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

2019 బ్యాచ్‌కు చెందిన జ్యోతి యాదవ్‌ ప్రస్తుతం మాన్సా జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. హర్‌జోత్‌ బెయిన్స్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత. గత పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆనంద్‌పుర్‌ సాహిబ్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ వివాహానికి దిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ హాజరు కానున్నట్లు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news