బద్వేలు బీజేపీ అభ్యర్ధిగా పుంతల సురేష్ ఫిక్స్

-

బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. కాసేపటి క్రితమే బద్వేలు నియోజక వర్గ ఉప ఎన్నిక అభ్యర్ధిగా పుంతల సురేష్ పేరు ఖరారు చేసింది బీజేపీ. కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన పుంతల సురేష్ పేరును ఖరారు చేసింది బీజేపీ అధినాయకత్వం.

ఏబీవీపీ, బీజేవైఎంలలో పని చేసిన అనుభవం ఉన్న నేపథ్యం లోనే బద్వేలు నియోజక వర్గ ఉప ఎన్నిక అభ్యర్ధిగా పుంతల సురేష్ పేరు ఖరారు చేసింది బీజేపీ.  ఇది ఇలా ఉండగా జనసేన పార్టీ మరియు టీడీపీ పార్టీ లు బద్వేల్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మృతి చెందిన ఎమ్మెల్యే భార్య‌కే వైసీపీ.. టికెట్ ఇస్తున్నందున బ‌రిలోకి దిగ‌టం లేద‌ని చెప్పాయి జ‌న‌సేన మరియు టిడిపి పార్టీలు. వార సత్వ రాజకీయాలకు వ్యతి రేకం అంటూ బిజేపి పార్టీ మాత్రం ఇవాళ అభ్యర్థిని ప్రకటించింది. కాగా వైసీపీ తరఫున డాక్టర్ సుధ పోటీ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news