జనసేన తో బిజెపి పొత్తు కొనసాగుతుంది: బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యులు ఏ రకంగా చర్చించుకుంటారో, పొత్తుల విషయంలో కూడా పార్టీ నేతలు అందరు కలసి చర్చించుకున్నాం అని అన్నారు. అలానే, పది మందికి పది రకాల అభిప్రాయాలు ఉండటం తప్పు కాదు అని కూడా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. అయితే భిన్న అభిప్రాయాలు ఉండటం తప్పు కాదు.

కానీ అందరి అభిప్రాయాలను తీసుకొని ఢిల్లీ లోని పెద్దలకు అందించడం జరిగింది అని చెప్పారు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. పొత్తుల విషయం లో నిర్ణయం అనేది జాతీయ అధ్యక్షులు ఖరారు చేస్తారు అని చెప్పారు పురంధేశ్వరి. జనసేన తో బిజెపి పొత్తు కొనసాగుతుంది అని కూడా పురంధేశ్వరి చెప్పారు. అలానే, కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలు ప్రచారం చేసుకుంటున్నారు అని కూడా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news