పూరీ జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబో రిపీట్.. ‘జనగణమన’ అఫీషియల్ అనౌన్స్‌మెంట్..!

-

టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘లైగర్’ చిత్రం కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా ఫిల్మ్ కాగా, దీనిని ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా, వీరి కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఈ నెల 29న 2.20 గంటలకు ముంబైలో ప్రారంభించినున్నట్లు తెలిపారు. ఇది కూడా పాన్ ఇండియా ఫిల్మ్ కాగా, దీనిని బాలీవుడ్ ప్రొడ్యూసర్ తో కలిసి తన సొంత బ్యానర్ లో పూరీ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు టాక్. ఇకపోతే ఇప్పటికే పూరీ జగన్నాథ్ – కరణ్ జోహార్ సంయుక్తంగా ‘లైగర్’ పిక్చర్ ప్రొడ్యూస్ చేశారు. ముంబైలోని ఓ చాయ్ వాల్ బాక్సర్ గా ఎలా మారాడు? ఎలా ఎదిగాడు? అనే కథాంశంతో సినిమా తీసినట్లు విడుదలైన ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.

ఇకపోతే వీరి కాంబినేషన్ రెండో సారి రిపీట్ అవుతుండగా, ఆ సినిమా స్టోరి ఏ నేపథ్యంలో ఉండబోతున్నదనేది చర్చనీయాంశంగా మారింది. చాలా కాలం నుంచి పూరీ జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్టు ‘జనగణమన’ గురించి మాట్లాడుతున్నారు. ‘లైగర్’ షూట్ కంప్లీట్ అయిన నేపథ్యంలో కూడా ఇక ‘జనగణమన’ అని కూడా కామెంట్ చేశారు.

తద్వారా తన నెక్స్ట్ ఫిల్మ్ ‘జనగణమన’ అనే సంకేతాలు ఇచ్చినట్లయింది. అది గతంలో మహేశ్ బాబుతో చేయడానికి ప్రయత్నించానని, కానీ, అప్పుడు మహేశ్ బిజీగా ఉన్నాడని పూరీ పేర్కొన్నట్లు కథనాలు వచ్చాయి. మొత్తంగా ఎట్టకేలకు ‘జనగణమన’ స్టోరిని విజయ్ దేవరకొండ చేయబోతున్నాడా? లేదా? అనే సస్పెన్స్‌కు రేపు తెర పడనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news