మరో అరుదైన అవార్డును సొంతం చేసుకున్న పుష్పరాజ్..!

-

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటన గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించారు. ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ ఇప్పుడు తాజాగా మరొక అరుదైన అవార్డును అందుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఆ అవార్డు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ చిత్రంతో తన కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగిపోయిందని చెప్పవచ్చు. ఈ సినిమా పుణ్యమా అంటూ పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు. అంతకుముందు అల్లు అర్జున్ కేవలం జాతీయంగా మాత్రమే క్రేజ్ సంపాదించారు. ఈ చిత్రం కారణంగా ఎంతటి క్రేజ్ పెరిగిందో రెమ్యూనరేషన్ విషయంలో కూడా అంతగానే డిమాండ్ పెరిగిపోయింది. ప్రఖ్యాతి జిక్యూ , మెన్ మ్యాగజైన్ 2022 కి గాను జిక్యూ మెన్ ఆఫ్ ద ఇయర్ 2022 పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా జిక్యూ బృందమే హైదరాబాద్ కి వచ్చి అల్లు అర్జున్ కు ఈ అవార్డు అందజేసినట్లుగా తెలుస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం .. తాజాగా ఫలక్ నుమా ప్యాలెస్ లో ప్రత్యేకమైన పార్టీ నిర్వహించి మరీ అల్లు అర్జున్ కి ఈ అవార్డ్ అందజేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పుష్ప సినిమా ఘనవిజయం సాధించడంతో ఈ నేపథ్యంలోనే పుష్ప -2 సినిమా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే సినిమా షూటింగ్ ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news