జడ్జీల మీద పూతల పట్టు ఎమ్మెల్యే బాబు సంచలన వ్యాఖ్యలు

-

ఏపీలో ప్రభుత్వం vs కోర్టులు అన్నట్టుగానే ఉంది పరిస్థితి. జడ్జ్ ల మీద కామెంట్స్ చేస్తున్న క్రమంలో కేసులు పెడుతున్నా అధికార పార్టీ నేతలు వెనక్కు తగ్గడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు జడ్జీల పై విరుచుకుపడ్డారు. అసలు మీరు జడ్జి లేనా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే.ఎవరు డబ్బులు ఇస్తే వారికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చేస్తారా ? అని అయన ప్రశ్నించారు. జడ్జీలుగా మీరు అవినీతికి పాల్పడే వచ్చా  ? అని ఆయన విమర్శించారు.

పేద కుటుంబంలో మీరు పుట్టలేదా ..పేదల కష్టాలు నీకు తెలియవా ? అని అయన ప్రశ్నించారు. కోర్టులలో చంద్రబాబు ఏమి చెబితే అది కీలకంగా మారుతున్నాయన్న ఆయన  ఇలాంటప్పుడు జడ్జి పదవికి మీరు మోసం చేసినట్టు కాదా ? అని ప్రశ్నించారు. బంగారు పాలెం మండలం తగ్గు వారి పల్లి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి కోర్టు ఇచ్చిన స్టే మధ్యంతర ఉత్తర్వులు పై ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. మరి ఈ విషయం మీద జడ్జ్ లు ఏమని స్పందిస్తారో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news