బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో సింధు ఓటమి

-

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమి పాలయ్యారు. దక్షిణకొరియా షట్లర్ ఆన్ సియోంగ్ చేతిలో 16-21, 12-21 తేడాతో ఓటమి పాలయ్యారు. సింధు డిఫెన్సివ్‌గా గేమ్ మొదలు పెట్టడం దక్షిణ కొరియా షట్లర్‌కు కలసి వచ్చింది. దీంతో తొలి సెట్‌ను 16-21 తేడాతో ఓటమి పాలయ్యారు. మొదటి గేమ్ చివరిలో సింధు పుంజుకుని ప్రతిఘటించినా సౌత్ కొరియా షట్లర్ సియోంగ్ తనదైన స్మాష్ షాట్లతో తొలి గేమ్‌ను గెలుపొందింది.

రెండో గేమ్‌ మొదట్లో సింధు గట్టిపోటీ ఇచ్చింది. కానీ, మిడ్ బ్రేక్ తర్వాత తాను ఫుట్‌వర్క్ కోల్పవడంతో రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కూడా కోల్పోయింది. అంతకుముందు సెమీ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన యమగూచిపై పీవీ సింధు 21-15, 15, 21, 21-19 తేడాతో గెలుపొందింది. పీవీ సింధు మూడేండ్ల క్రితం 2018లో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌ గెలుపొందింది.

Read more RELATED
Recommended to you

Latest news