బీజేపీలోకి రఘురామ…కేసులు పోతాయా?

-

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు…వైసీపీపై దండయాత్ర చేస్తూనే ఉన్నారు. ఆ పార్టీ తరుపున ఎంపీగా గెలిచి…అదే పార్టీకి వ్యతిరేకంగా రఘురామ రాజకీయ పరమైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోనే ఉంటూ రోజూ రచ్చబండ పేరిట జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇక లోక్‌సభలో సైతం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల జగన్ ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేస్తుందని మాట్లాడారు. తాజాగా అమరావతి రైతుల మహాపాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని, గాంధేయ పద్ధతిలో రైతులు చేస్తున్న మహాపాదయాత్రను అడ్డుకోవడం అన్యాయమని, హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమని రఘురామ అన్నారు.

శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమైనా అక్కడ క్షీణించాయని, ప్రజల ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక ఈలోపు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లేచి..రఘురామ వ్యాఖ్యలని తప్పుబట్టారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు రఘురామ అధికార బీజేపీలో చేరేందుకు తహతహలాడుతున్నారని, రఘురామపై ఉన్న సీబీఐ కేసులపై వేగంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రఘురామ…మిథున్‌కు కౌంటర్ ఇచ్చారు. తన పైన రెండు సీబీఐ కేసులే ఉన్నాయని… సీఎం జగన్‌ పైన బోలెడు సీబీఐ కేసులున్నాయని, ముందు వాటి సంగతి తేల్చాలని డిమాండ్ చేశారు.

అయితే వైసీపీతో విబేధించిన దగ్గర నుంచి రఘురామ..వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అందుకే రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు ఎప్పటికప్పుడు లోక్‌సభ స్పీకర్‌ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆయనపై అనర్హత వేటు వేయడం లేదు. ఆయనకు బీజేపీ మద్ధతు ఉందని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి…రఘురామ బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని మాట్లాడారు. మొత్తానికైతే రఘురామకు బీజేపీ మద్ధతు ఉందని మాత్రం అర్ధమవుతుంది..మరి ఆయనపై కేసులు ఏం అవుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news