వివేకానంద రెడ్డిని హత్య చేసింది మా పార్టీ సానుభూతిపరులు, ఆషాడభూతులే…!

-

మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారిని తమ పార్టీ సానుభూతిపరులు, ఆషాడభూతులే హత్య చేశారని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. వై.యస్. వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారని తొలిత పేర్కొన్నప్పటికీ, తరువాత గొడ్డలిపోటుతో మరణించినట్లుగా చెప్పారని, గొడ్డలి పోటుతో మరణించిన వ్యక్తిని ఫ్రీజర్ లో పెట్టడానికి వీలు లేదని సీఐ శంకరయ్య వారించారని తెలిపారు.

వై.యస్. వివేకానంద రెడ్డి గారి గాయాలకు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి కట్లు వేసిన అనంతరం శవాన్ని ఫ్రీజర్ లో పెట్టాలనుకున్నారని, వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్యకు ఉపయోగించిన గొడ్డలి కొనుగోలుకు ముందు వై.యస్. అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారిలతో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నట్లు తెలిసిందని అన్నారు. గూగుల్ టేక్ అవుట్ ను నమ్మమని కొంత మంది చెబుతున్నప్పటికీ, కేసు ట్రయల్స్ కు వచ్చినప్పుడు ఆ విషయాన్ని చెప్పుకోండని అన్నారు. వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కోసం నిందితులకు ఇచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని, తన తల్లిని వేధించాడని సునీల్ కుమార్ కోట్ల రూపాయల డబ్బు ఖర్చు చేసి హత్య చేశాడు అంటే బుద్ధి ఉన్న ఏ ఒక్కరూ నమ్మరని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news