పాక్- చైనా ఒక్కటి అవుతున్నా… బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు – రాహుల్ గాంధీ.

-

కాంగ్రెస్ పార్టీని చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని… కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా రాహుల్ గాంధీ పలు వ్యాఖ్యలు చేశారు. మేము అడిగిన ప్రశ్నలకు బీజేపీ జవాబు చెప్పలేదని ఆయన అన్నారు. గతంలో కూడా మేము కరోనా పరిస్థితుల గురించి ప్రస్తావించామని.. ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. rahul gandhiప్రస్తుతం పాకిస్తాన్- చైనాలు ఒక్కటయ్యాయని.. ఇది ఇండియాకు ప్రమాదకరం అని ఆయన అన్నారు. దీనిపై కూడా బీజేపీ స్పందించడం లేదని అన్నారు. చైనా సైనికులు పీఓకేలోకి వస్తున్నారని.. ఇవన్నీ భారత్ కు ప్రమాదంకరమైనవి రాహుల్ గాంధీ అన్నారు. నా ముత్తాత దేశానికి సేవ చేశారని.. మాకు ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదని.. మేం నిజాలు చెబుతున్నాం కాబట్టి కాంగ్రెస్ అంటే బీజేపీకి భయం పట్టుకుందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news