“ప్రగతి భవన్” పేరును మారుస్తాం: రాహుల్ గాంధీ

-

ఈ రోజు తెలంగాణ ఎన్నికలకు సమయం వస్తుండడంతో మ్యానిఫెస్టోను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ఒక అద్భుతమైన విషయాన్ని తెలియచేశారు. తెలంగాణాలో ప్రజలు మాకు ఓట్లు వేసి గెలిపిస్తే సరికొత్త రాష్ట్రాన్ని చూస్తారంటూ రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు తెలంగాణాగా మాత్రమే ఉందని.. ఆ తర్వాత ప్రజల తెలంగాణగా పిలుచుకునేలా అభివృద్ధిని చేసి చూపిస్తాం అంటూ రాహుల్ గాంధీ మాటిచ్చారు. అంతే కాకుండా ఇప్పటి వరకు BRS పాలనలో ప్రగతి భవన్ గా ఉన్న భవనాన్ని కాంగ్రెస్ విజయం సాదిస్తే ప్రజా పాలనా భవన్ గా మారుస్తాము అంటూ చెప్పారు. ఈ భవనం యొక్క తలుపులు ఎనీ టైం తెరుచుకునే ఉంటాయంటూ ప్రజలకు ఒక మంచి విషయాన్ని తెలియచేశారు.

మీరు ఫిర్యాదు చేసిన ఏ సమస్యను అయినా కేవలం 72 గంటల్లోనే పరిష్కరించి మా పాలనా ఏమిటో నిరూపిస్తామంటూ రాహుల్ గాంధీ శపధం చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news