పురంధేశ్వరి పై మరోసారి కామెంట్ చేసిన విజయసాయి రెడ్డి…!

-

ఆంధ్రప్రదేశ్ లో పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా అయినప్పటి నుండి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆమెపై మీడియా ముఖంగా, సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ రోజు మరోసారి సోషల్ మీడియా వేదికగా పురందేశ్వరి పై విజయసాయి రెడ్డి విమర్శలను వెదజల్లారు. పురందేశ్వరి ఏపీలో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు అంటూ మెసేజ్ చేశారు. అందుకు “పురందేశ్వరి గారూ ఈసారి మీరు ఎక్కడ నుండి పోటీ చేస్తారో చెప్పగలరా ? మీరు పోటీ చేసే స్థానాన్ని మీ పార్టీ డిసైడ్ చేస్తుందా ? లేక మీ బావ గారు నిర్ణయిస్తారా ? ఆయన మద్దతు కోసమేగా మీరు ఆయనపై ఈగ కూడా వాలకుండా చూస్తున్నారు అంటూ చాలా వ్యంగ్యంగా విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

ఇదేమీ మొదటిసారి కాకపోవడం మరియు రాజకీయాలలో ఒకరిని మరొకరు విమర్శించడం చాలా సాధారణం అయిపోయింది. అందుకే ఈ విషయం పై ఇంకా బీజేపీ నుండి ఎవరూ స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news